67 ఏళ్ళ స్వాతంత్ర్య దేశంలో
ఈ రాష్ట్ర చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం
పదవికోసం
ప్రాకులాడే నాయకులు
అవసరం
కోసం ఆర్జించే అధికారులు
అయోమయంలో
ప్రజలు
రాజకీయ
లబ్ధి కోసం
రాష్ట్రాన్ని
ప్రాంతాలుగా
ప్రాంతాలను
దీవులుగా
మార్చాలనే
కపట నాయకుల
పగలు, ఉద్యమ సెగలై
నిరంతరం
ప్రజలను వేధిస్తున్నాయి
ఈ స్వాతంత్ర్యం ప్రజా నాయకులకు
అధికారాన్ని
ప్రజలకు అంధకారాన్ని
మిగిల్చినట్లయింది
.
ఇకననైనా
భారతీయ పౌరిడిగా జీవించు
భావి
తరాలకు ఆదర్శంగా ఆలోచించు
దేశ
ప్రగతికై అన్వేషించు
నువ్వు
బాగుంటే దేశం బాగుంటుందని తెలుసుకో
నిజాయితీ
గల నాయకుణ్ణి ఎంచుకో
నీ దేశ
తలరాతను మార్చుకో
** జై హింద్ **
No comments:
Post a Comment